07-06-2025 12:10:51 AM
-ఎలాంటి సేఫ్టీ ప్రమాణాలు పాటించని వైనం
-నిర్మాణ అనుమతులు అంతంత మాత్రమే
-మామ్ముళ్ల మత్తులో సంబంధిత అధికారులు
-తినే అన్నంలోనూ పురుగులు, బొద్దింకలు
అబ్దుల్లాపూర్మెట్, జూన్ ౬: అబ్దుల్లాపూర్మెట్, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ ప్రాం తాల్లో పుట్టగొడుగులా ప్రైవేట్ హాస్టల్లో పు ట్టుకొస్తున్నాయి. మండల కేంద్రంలో ఉన్నత విద్యా, వృత్తి విద్య కళాశాల తో పాటు పలు పాఠశాలలు ఉన్నాయి. దీంతో ఇక్కడికి వి ద్యా అభ్యసించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు వస్తున్నారు.
విద్యార్థుల వసతి సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని పలువురు వసతి గృహాలను ఏర్పాటుచేసి వ్యాపా ర కార్యక్రమాలకు తెరలేపారు. హాస్టళ్లు నిర్వాహకులు మాత్రం ఎలాంటి సెఫ్టీ ప్రమాణా లు పాటించడకుండానే హాస్టళ్లు నిర్వహిస్తున్నారు. భవన నిర్మాణ అనుమతులు కూడా అంతంతా మాత్రంగానే ఉంటున్నాయి. ఎ లాంటి నిర్మాణాలను అనుమతులైనా.. పం చాయతీ అధికారులు జీ+2 వరకు అనుమతులు ఇస్తారు కానీ.. ఇక్కడ ఆ నిర్మాణాలను జీ+3, జీ+4 వరకు నిర్మాణాలు చేపడుతున్నారు.
ఈ హాస్టళ్లు దాదాపు కమర్షియల్ బిల్డింగ్లలో నిర్వాహించాలని కానీ.. అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతంలో మాత్రం రెసిడెన్సి యల్ బిల్డింగ్లను నిర్వాహకులు అద్దె ప్రతిపాదికన తీసుకోని వసతి గృహాలను నిర్వహి స్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేసిన వసతి గృహాల్లో సరైన వసతులు విద్యార్థులకు అందుతున్నాయా లేదా అంటూ తనిఖీలు నిర్వహించాల్సిన సంబంధిత అధికారులు మాత్రం అటువైపు మా కన్నెత్తి చూడకపోవడం విడ్డూరం.
వసతి గృ హంలో ఉంటున్న విద్యార్థులు కళాశాల స మయంలో భోజనం తమ వెంట తీసుకెళ్లిన లంచ్ బాక్స్లో అన్నంతో పాటు పురుగులు దర్శనమిచ్చిన ఘటనలో కోకొల్లలు.దీంతో ఆ విద్యార్థులు హాస్టళ్లు నిర్వహకులు నిలదీయగా.. వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పు తూ... మీ ఇష్టం ఉంటే ఉండడండి.. లేకపోతే వెళ్లిపోండి... నిర్వాహకులు విద్యార్థుల తో దుర్గా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వేలకు వేలు డబ్బులు కట్టి బస్సులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అన్నీ అక్రమ నిర్మాణాలే.. !
అబ్దుల్లాపూర్మెట్ మండల పరిసరా ప్రాంతాలు అబ్దుల్లాపూర్, ఇనాంగూడ, లష్కర్గూడ గ్రామాల రెవెన్యూ పరిధిలో అబ్దు ల్లాపూర్మెట్ చుట్టు ప్రక్కల వరకు ఉంటా యి. ఇక్కడ నిర్మించే నిర్మాణాలు అన్నీ అక్రమంగా ఉంటాయి. ఈ చుట్టూ పక్కల మొ త్తం ప్రైవేట్ హాస్టళ్లు దర్శమిస్తుంటాయి. వీ టికి చాలా వరకు ఎలాంటి అనుమతులుండవ్.. ఒక వేళ ఉన్నా.. కొంత మేరకు ఉంటా యి. గ్రామ పంచాయతీ ఇచ్చే అనుమతులు జీ+2 వరకు వాళ్ల పరిమితి.. ఆ తరువాత హెచ్ఎండీఏ వెళ్లికానీ.. అలా చేయకుండా జీ+2 పర్మిషన్లు తీసుకొని జీ+3, జీ+4 వరకు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు.
అదే విధంగా హాస్టల్స్ నిర్వహించా లంటే కమర్షియల్ కాంప్లెక్స్ లో నిర్వహించాలి....అలా కాకుండా రెసిడెన్సియల్ పర్మిషన్లు తీసుకొని నిర్మాణాలు చేపట్టి హాస్ట ల్స్ నిర్వహిస్తున్నారు. అలాగే రెసిడెన్సియల్ పర్మిషన్లు తీసుకొని.. కమర్షియల్ కాంప్లెక్సులు నిర్వహిస్తున్నా సంబంధిత అధికారు లు అటువైపు చూడారు. ఆ నిర్మాణాలు అడ్డుకోరు.. దీని వెనుకల మర్మం ఏమీటో అర్థం కావడంలేదు. అబ్దుల్లాపూర్ గ్రామ పంచాయతీ ఆఫీసు దగ్గర హై జంక్షన్ కింద నే జీ+1 బిల్డింగ్ నిర్మించి.. బాయ్స్ హాస్టల్ బోర్డు పెట్టారు.
ఈ హై జంక్షన్ వైర్ల కింద సంబంధిత అధికారులు పర్మిషన్లు ఎలా ఇచ్చారు..? అదే విధంగా అబ్దుల్లాపూర్ నుంచి కవాడిపల్లి వెళ్లే రోడ్డు అనుకుని భారీ ఎత్తున కమర్షియల్ నిర్మాణాలు చేపట్టారు. కింద సెల్లర్ తీసుకొని పర్మిషన్లు ఉన్నాయి... అదే విధంగా జీ+2 ఉంటే జీ+4 నిర్మించారు. ఇలా చెప్పుకుండా పోతే అబ్దుల్లా పూర్లో అన్నీ అక్రమ నిర్మాణాలే.
మామ్ముళ్ల మత్తులో సంబంధిత అధికారులు..!
హాస్టల్ నిర్వహించాలంటే పలు శాఖల నుంచి అనుమతులు తప్పనిసరి. స్థానిక పోలీస్, ట్రాఫిక్, ఫైర్ డిపార్ట్మెంట్ల అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. అలాగే స్థానిక గ్రామ పంచాయతీ నుంచి ట్రెడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్ స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ, విద్యుత్శాఖ, ఫుడ్ లైసెన్స్ తదితర అనుమతులు తీసుకోని నిర్వహించాలని.. కానీ ఇక్కడ ఏ వసతి గృహాల్లో సంబం ధిత శాఖల అధికారుల అనుమతులు లేకుండానే కొనసాగుతున్నాయి. సంబంధించిన అధికారులు మా మ్ములు తీసుకొని.. హాస్టళ్లపై కనీస పర్యవేక్షణ కూడా చేయడం లేదని పలువురు విద్యార్థులు ఆరోపణ గుప్పిస్తున్నారు . అలాగే ఫుడ్సెఫ్టీ అధికారు అయితే గత సంవత్సరం కాలం తనిఖీలు నిర్వహించా దఖాలు లేవు. దీంతో ఆయా శాఖల అధికారుల తీరులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ ఆదాయానికి గండి
అబ్దుల్లాపూర్మెట్ పరిసరా ప్రాంతాల్లో నిర్వహించే హాస్టళ్లు నిర్వాహకులు ఎలాంటి అనుమతులు తీసుకుండానే హాస్టళ్లు నిర్వహిస్తుండ్రు. పన్నుల రూపకంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండికొడుతుండ్రు. ఈ ప్రాంతంలో నిర్వహించే ప్రై వేట్ హాస్టల్స్ అన్నీ నిబంధనలకు విరుద్దంగానే నడిపేవాటిపై చర్యలు తీసుకోవాలి.
ఎర్ర శ్రీహరి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు