09-07-2025 03:57:29 PM
సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ నడికుడి బ్రాంచ్ చైర్మన్ వెలిజాల రమేష్
రైల్వే స్టేషన్ లో ధర్నా
నల్గొండ టౌన్,(విజయ క్రాంతి): ఓల్డ్ పెన్షన్ స్కీం వెంటనే పునరుద్ధరించి రైల్వేలో ప్రైవేటీకరణ నిలిపివేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ నడికుడి బ్రాంచ్ చైర్మన్ వెలిజాల రమేష్ పేర్కొన్నారు. సంఘ్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వేలో ఖాళీలను వెంటనే భర్తీ చేసి 8పే కమిషన్ ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.