15 June, 2026 | 10:00 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడండి

15-10-2025 10:51 PM

ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతి..

హన్మకొండ (విజయక్రాంతి): గత సంవత్సరం మార్చి నుండి ఇప్పటివరకు ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు,ఉపాధ్యాయులకు ప్రభుత్వము నుండి ఎలాంటి ప్రయోజనాలు అందలేదని, సంవత్సరంన్నర కాలం గడిచినప్పటికీ పెన్షన్ తప్ప తమకు రావలసిన జీపీఎఫ్, టీఎస్జీఎల్ఎస్సీ, జీఐఎస్, లీవ్ ఇన్ క్యాస్మెంట్ కమ్యుటేసన్, గ్రాట్యుటీ మొదలగు ఎలాంటి ప్రయోజనాలు అందకపోవడంతో మానసిక క్షోభకు గురి అవుతున్నామని రిటైర్డు ఉద్యోగ, ఉపాధ్యాయులు అన్నారు.

కొంతమంది మనోవేదనతో అసువులు బాసిన వాళ్లు కూడా ఉన్నారని అన్నారు. బకాయిల సాధన కమిటీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా బుధవారం వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని కలిసి వినతి పత్రాలు అందించారు. వెంటనే తమ రిటైర్డ్ బెనిఫిట్స్ ఇచ్చి, తమ ఆత్మగౌ రవాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు శ్రీదర్ల ధర్మేంద్ర, ప్రధాన కార్య దర్శి కడారి భోగేశ్వర్, అసోసియేట్ అధ్యక్షులు కె. దేవదాస్, ఎండీ గఫార్, కార్యదర్శులు మెకిరి దామోదర్, ఆర్వీ చలం, పీ అశోక్ కుమార్, శ్యామ్ రావు, బీ.సారయ్య, రాజేందర్, బీ. వెంకటేశ్వర్లు, ఎస్.శ్యామ్ సుందర్ రెడ్డి, సంజీవ రెడ్డి, గణపతి, ఐత రవీందర్ పాల్గొన్నారు.