8 April, 2026 | 2:18 AM

ట్రాక్టర్‌తో గుద్ది హత్య చేశారని ఆందోళన

08-04-2026 12:00 AM

కుటుంబ సభ్యుల రాస్తారోకో 

లక్ష్మణ చందా, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): మామాడ మండలంలోని దిమ్మదుర్తి గ్రా మానికి చెందిన దుండగుల సాయిరాం రోడ్డుపై మృతి చెందడంతో కుటుంబ సభ్యు లు ఆందోళన చేశారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో సాయిరాం ఇంటికి వస్తుండగా ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు.

అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కాదని సాయి రాంను ట్రాక్టర్‌తో గుద్ది హత్య చేశారని కుటుంబ సభ్యులు మంగళవారం ఆందోళన చేశారు. ఖానాపూర్ నిర్మల్ జాతీయ రహదారిపై దిమ్మదుర్తి వద్ద గంట సేపు బైఠాయించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సీఐ కృష్ణ ఎస్త్స్ర హనుమాన్లు అక్కడికి చేరుకుని ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.