10 June, 2026 | 3:54 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే ప్రాణాలకు భద్రత

13-01-2026 11:00 PM

వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్

వేములవాడ,(విజయక్రాంతి): వేములవాడ రూరల్ సర్కిల్ పరిధిలో “అరివ్ అలైవ్” రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం ప్రారంభమైంది. వట్టెంల గ్రామంలో  మంగళవారం నిర్వహించిన గ్రామస్థాయి సమావేశంలో రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ వెంకట్రాజం పాల్గొని రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రతి ప్రయాణం సురక్షితంగా ముగిసి ప్రతి వ్యక్తి క్షేమంగా ఇంటికి చేరాలన్నదే “అరివ్ అలైవ్ ” థీమ్ ఉద్దేశమని చెప్పారు. అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్, హెల్మెట్, సీట్‌బెల్ట్ వాడకపోవడం, మొబైల్ వినియోగం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని, వాటిని నివారించాలంటే ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.