15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కవ్వాల్, అమ్రబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

29-10-2025 01:00 AM
  1. ఉద్యోగులు పనితీరును మెరుగు పర్చుకోవాలి
  2. పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ  

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): ఉద్యోగులు సమయపాలన పాటించడంతో పనితీరు మరింత మెరుగుపడుతోందని తెలంగాణ అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారిణి డాక్టర్ సువర్ణ తెలిపారు. పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరగనున్న వర్క్‌షాప్‌ను సువర్ణ ప్రారంభిం చారు. ఈ కార్యక్రమానికి 18 రాష్ట్రాల నుంచి ఐఎఫ్‌ఎస్ అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సువర్ణ మాట్లాడుతూ ఉద్యోగులుగా వ్యక్తిగత, ఉద్యోగ జీవితాల మధ్య సమతుల్యత కీలకమని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయన్నారు. తెలంగాణలోని అమ్రబాద్, కవ్వాల్‌టైగర్  రిజర్వులు, అర్బన్ పార్కులు, ఏకో- టూరిజం ఆకర్షణలు దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయన్నారు. అధికారులు తీరిక చూసుకుని ‘రైజింగ్ వైబ్రంట్ తెలంగాణ’ను సందర్శించాలని ఆమె సూచిం చారు. ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ ఎస్‌జే ఆశా, డిప్యూటీ డైరెక్టర్ ప్రవీణ, అధికారులు పాల్గొన్నారు.