2 July, 2026 | 4:10 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

భోజనంలో నాణ్యత ముఖ్యం

22-10-2025 12:00 AM

కలెక్టర్ హైమావతి 

నంగనూరు, అక్టోబర్ 21: నంగునూర్ మండలం పాలమాకుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ కె హైమావతి క్షేత్రస్థాయిలో సందర్శించారు.మధ్యాహ్న భోజనం నాణ్యత, అమలు తీరుపై కలెక్టర్ ఆరా తీశారు.రోజువారీ కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా పాటించాలని,విద్యార్థుల హాజరు ప్రకారం ఆహార పదార్థాలను కొలత వారిగా ఉపయోగించి, రుచికరంగా వండాలని వంట సిబ్బందికి సూచించారు.

పాఠశాలలో ఫుడ్ చెకింగ్ ఉపాధ్యాయుడు,హెచ్‌ఎం రోజు మొత్తం ప్రక్రియను పర్యవేక్షణ చేయాలని,పిల్లలకు చదువు,మధ్యాహ్న భోజనం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు.భోజనం నాణ్యత విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.అనంతరం విద్యార్థులతో ముచ్చటిస్తూ..మధ్యాహ్న భోజనంలో ఏం వండారని,రుచిగా ఉందా లేదా అని అడిగి తెలుసుకున్నారు.