17 April, 2026 | 2:50 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి..

21-10-2025 10:50 PM

పోలీస్ అమర వీరులకు కొవ్వొత్తులతో ర్యాలీ..

బెజ్జంకి: పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని బెజ్జంకి ఎస్ఐ బోయిని సౌజన్య అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగవారం ఎస్ఐ స్థానిక ప్రజలతో కలిసి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళులు అర్పించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరించుకుంటూ దానికి గుర్తుగా ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం నిర్వహించుకుంటామని తెలిపారు. 

విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మనకు స్ఫూర్తి అన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూ అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనుకాడరని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శంకర్ రావు, పోలీస్ సిబ్బంది, లింగాల లక్ష్మణ్, నారెడ్డి సుదర్శన్ రెడ్డి, గుబిరే మల్లెషం, శేఖర్,మోహన్, పర్శరాములు, బండారి రాములు, నరసింహా రెడ్డి స్థానికులు పాల్గొన్నారు.