2 July, 2026 | 3:10 PM

Breaking News

తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •  

పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి..

21-10-2025 10:50 PM

పోలీస్ అమర వీరులకు కొవ్వొత్తులతో ర్యాలీ..

బెజ్జంకి: పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని బెజ్జంకి ఎస్ఐ బోయిని సౌజన్య అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగవారం ఎస్ఐ స్థానిక ప్రజలతో కలిసి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళులు అర్పించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరించుకుంటూ దానికి గుర్తుగా ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం నిర్వహించుకుంటామని తెలిపారు. 

విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మనకు స్ఫూర్తి అన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూ అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనుకాడరని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శంకర్ రావు, పోలీస్ సిబ్బంది, లింగాల లక్ష్మణ్, నారెడ్డి సుదర్శన్ రెడ్డి, గుబిరే మల్లెషం, శేఖర్,మోహన్, పర్శరాములు, బండారి రాములు, నరసింహా రెడ్డి స్థానికులు పాల్గొన్నారు.