22-10-2025 12:00:00 AM
జగదేవపూర్, అక్టోబర్ 21: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం జగదేవపూర్ శాఖ ఆధ్వర్యంలో శాఖ ఉపక్రమంలో భాగంగా జగదేవపూర్ పట్టణ కేంద్రంలోని గొల్లపల్లి రోడ్డు మూలమలుపు భారీ గుంతలను పుడ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత కొంత కాలంగా ప్రజలు పడుతున్న ఇబ్బంది చూసి గుంత ను పూడ్చినట్టు తెలిపారు. దేశం కోసం ధర్మం కోసం యువత ముందు ఉండాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ఏగొండ, కరుణాకర్ రెడ్డి, సంఘ సభ్యులు గాండ్ల రాజేంద్ర, రాఘవేంద్ర, రాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.