17-09-2025 11:56:07 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు రైతులకు, పరిశోధనా కేంద్రాల్లో అభివృద్ధి చేసిన నాణ్యమైన విత్తనాన్ని సరఫరా చేసి, విత్తనోత్పత్తిని గ్రామంలోనే ప్రోత్సహించేందుకు గ్రామ గ్రామన నాణ్యమైన విత్తనం (క్వాలిటీ సీడ్స్ ఇన్ ఎవ్రి విలేజ్-క్యూఎస్ఇవి) అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున కొత్తపల్లి మండలం కమాన్ పూర్ గ్రామం లో వరి (జె జి ఎల్ - 24423) క్షేత్రాలను పరిశీలించి, బెరుకు లు తీసివేయాలి అని సూచిoచారు. పైరు లో కొద్దిగా ఆకుముడత ను గమనించడం జరిగింది. ఆకు ముడత నివారణ కొరకు కార్టాప్ హైడ్రో క్లోరైడ్ 2గ్రాములు ఒక లీ నీటికి చొప్పున పిచికారీ చేయాలని తెలిపారు.