04-01-2026 06:23:54 PM
జిల్లా వ్యవసాయ అధికారి సరిత.
మరిపెడ, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో యూరియా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను జిల్లా వ్యవసాయ అధికారి బి సరిత సందర్శించడం జరిగింది. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందకూడదు. యూరియా అందరికీ దొరుకుతుంది ప్రతి రైతుకి యూరియా అందించడమే ప్రభుత్వ ధ్యేయం రైతులెవ్వరు కూడా అధైర్య పడొద్దు. మీకు ఇస్తున్న యూరియా దఫళ వారీగా ఉపయోగించుకోండి దానితోపాటు నానో యూరియా గురించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది . కావున ప్రతి రైతుకు యూరియా అందడం జరుగుతుంది మరిపెడలో ఉన్న నిలువలపై ఆరదియ్యడం జరిగింది.రైతులెవ్వరు కూడా రోడ్లపై రాకూడదు ముఖ్యంగా మరిపెడ రాకూడదు మీ విలేజ్ లోనే కౌంటర్లు పెట్టిరైతులకు ఎక్కడికక్కడ యూరియా అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి.విరాసింగ్ మరియు ఏవోలు పాల్గొనడం జరిగింది.