18 July, 2026 | 12:31 PM

Breaking News

Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •  

కష్టపడి పని చేసిన వారిని నాయకులుగా తీర్చిదిద్దుతాం

03-08-2025 12:31 AM

ఖమ్మం,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ గురించి కష్టపడి పని చేసిన వారిని కొత్తతర నాయకులుగా తీర్చిదిద్దుతాం అని ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం కూడా అదే అని రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ జాతీయ నిర్వాహకులు గంటా వినయ్ నాయుడు అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలం సంజీవ్ రెడ్డి భవన్ నందు రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు  పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జిల్లా స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిలుగా రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ జాతీయ నిర్వాహకులు గంటా వినయ్ నాయుడు, రాష్ట్ర సమన్వయకర్త మహ్మద్ జావేద్ హాజరైనారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామస్థాయి, మండల స్థాయి, నియోజకవర్గస్థాయి, జిల్లాస్థాయి, పార్లమెంటు నియోజకవర్గలస్థాయి నుంచి ప్రతి ఒక్కరిని గుర్తించడంలో ఈ కార్యక్రమం ముందంజలో ఉంటుందని ఈ సందర్భంగా ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం మీరందరూ నిరంతరం కృషి చేయాలని దిశా నిర్దేశం చేసారు.