21 March, 2026 | 6:35 PM

భైంసాలో ఘనంగా రంజాన్ వేడుకలు

21-03-2026 04:31 PM

భైంసా,(విజయక్రాంతి): భైంసా పట్టణంలో శనివారం రంజాన్ పండుగను మైనార్టీ సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణంలోని బైంసా గడ్డన్న శుద్ధ వాగు ప్రాజెక్టు వద్ద ప్రార్థన లు చేశారు. ఉదయం 9 గంటలకు పవిత్ర నమాజులు చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని జిల్లా సాయికుమార్ ఎస్సైలు ప్రవీణ్ సాయికుమార్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మైనార్టీ నాయకులకు జిల్లా ఎస్పీ జానకి మున్సిపల్ చైర్మన్ దత్తాద్రి స్థానిక రాజకీయ పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఎస్పి జానకి షర్మిల చిన్నపిల్లలకు శుభాకాంక్షలు తెలిపి చాక్లెట్లను పంచిపెట్టారు