16-08-2025 05:37:22 PM
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం ఎంపీపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రం వెంకన్న సేవలు అభినందనీయం,అనుసరణీయం అని జిల్లాపరిషత్ రాంపురం ప్రధానోపాధ్యాయులు శశిధర్ అన్నారు. తాను పనిచేస్తున్న పాఠశాల కోసం వారి నేస్తం మిత్రులు, వాకర్స్ మిత్రులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ మిత్రులు, ఇంకా కొంతమంది దగ్గరి మిత్రుల నుండి సేకరించిన రూ.9000/- లతో ఆహుజ కంపెనీ సౌండ్ సిస్టంను తీసుకొని రాంపురం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు చేతుల మీదుగా పాఠశాలకు ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ పాఠశాలకు వచ్చిన మొదటి రోజు నుండి మొదలుకొని ఇప్పటివరకు పిల్లల అవసరాలు తీర్చడానికి, పాఠశాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. గతంలో పిల్లలకు నోట్ పుస్తకాలు, పెన్నులు,పెన్సిల్ లు,నవోదయ పుస్తకాలు ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు ప్రార్థన సమయంలో వివిధ రకాల కార్యక్రమాల నిర్వహణకు ఉపయోగపడే సౌండ్ సిస్టంను తీసుకురావడం ఎంతో ఉపయోగం అన్నారు. వెంకన్న గారిని తోటి ఉపాద్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.