17-05-2025 12:00:00 AM
హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్స్ నిపుణుల బృందం అరుదైన శస్త్రచికిత్సను విజ యవంతంగా నిర్వహించి, ఏడేళ్ల విదేశీ చిన్నా రి ఖాజా (పేరు మార్చబడింది) జీవితాన్ని రక్షించింది. గతంలో అనేక ఆసుపత్రులలో చికిత్స కోసం ప్రయత్నించినా, ట్యూమర్ స్థానం సంక్లిష్టంగా ఉండటంతో శస్త్రచికిత్స సాధ్యపడదని నిరాకరించారు.
ఈ చిన్నారి మెదడు స్టెమ్ ప్రాంతంలో అరుదైన, ప్రమాదకరమైన ట్యూమర్ ఉన్నట్లు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు గుర్తించారు. ఈ క్లిష్టమైన కేసును డాక్టర్ శ్రీకాంత్రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో, స్పున్ సర్జన్ స్వీకరించి, అత్యాధునిక సాంకేతిక పరికరాలతో సహా (ఇన్ట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్, న్యూరో మైక్రోస్కోప్, సుశక్తమైన కూసా 10 ఎన్ఎమ్ పరికరం) అత్యంత జాగ్రత్తగా శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.
ట్యూమర్ పూర్తిగా తొలగించి, చిన్నారికి పునరుజ్జీవం పోశారు. దీంతో చిన్నారికి ఎటువం టి న్యూరాలాజికల్ సమస్యలు ఎదురవలే దు. శస్త్రచికిత్స తర్వాత పోస్ట్ ఆపరేటివ్ పిల్లల ఐసీయూ కీలక భూమిక పోషించింది. చిన్నా రి ఆరోగ్యం మెరుగుపడేందుకు మైక్రో లెవె ల్ మానిటరింగ్, వెంటిలేటరీ మద్దతు, న్యూరో ప్రొటెక్షన్ పద్ధతులతో చికిత్సను కొనసాగించారు.
బ్రెయిన్ సర్జరీ తర్వాత పిల్ల ల చికిత్స చాలా సున్నితమైనదని, ప్రతి నిమి షం ప్రతి పరిణామాన్ని సమీక్షిస్తూ చికిత్సను ముందుకు తీసుకువచ్చామని డాక్టర్ జనార్దన్రెడ్డి, హెచ్ఓడి, పీడియాట్రిక్ ఐసీయూ చెప్పారు. ఖాజా కేసు తమ బృంద సమిష్టి నైపుణ్యానికి ఉదాహరణ అని డాక్టర్ రవీందర్రెడ్డి, హెచ్ఓడి, పిల్లల విభాగం అన్నారు.