calender_icon.png 6 June, 2025 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్వసనీయత పెరగాలి

03-05-2025 12:00:00 AM

పత్రికలు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి వంటివి. ప్రజాస్వామ్యంలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగి సమర్థ పరిపాలన అందించడానికి ఇవి తోడ్పడతాయి. అమెరికాలాంటి ప్రజాస్వామ్య సమాజంలో పత్రికలను ప్రత్యామ్నాయ ప్రభుత్వంగా, ప్రజాకోర్టుగా కూడా పేర్కొంటారు. ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య సమాజంలోనైనా జరుగుతు న్న సంఘటనలు, పరిణామాల తాలూ కు సమగ్ర సమాచారాన్ని పౌరులకు అందించడంలో వీటిది ఎంతో కీలకమై న పాత్ర. వర్తమానంలో అందిన సా మాజిక వారసత్వాన్ని రానున్న తరాల వారికి అందజేస్తాయి.

మరోవైపు వినోదాన్ని కూడా కలిగిస్తూ మానసిక ఒత్తిడి ని తగ్గించడంలోనూ పత్రికలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇంతటి ప్రధాన పా త్రను పోషించడానికి పత్రికలకు స్వేచ్ఛ అత్యవసరం. ఈ నేపథ్యంలోనే మే 3న ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం’ జరుపుకుంటాం. 

ఈ సందర్భంగా మీడియా స్వేచ్ఛ ను, ప్రాథమిక సూత్రాలను ప్రోత్సహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా మీడియా స్వాతంత్య్ర స్థితిని అంచనా వేయడం, జర్నలిస్టులు, మీడియా నిపుణులపై దాడుల నుంచి రక్షించడంపై దృష్టి పెట్టడం జరగుతుంది. భారతదేశంలో పత్రికల పాత్రను పరిశీలిస్తే, స్వాతంత్రోద్యమ కాలం నుంచి నేటివరకు ప్రజల ను చైతన్య పరుస్తున్న ముఖ్య సాధనాలుగా పత్రికలు అద్వితీయ పాత్రను పోషిస్తున్నాయి.

పత్రికా స్వేచ్ఛ విషయంలో భారత రాజ్యాంగంలో ఎక్కడ అధికారికంగా ప్రస్తావించక పోయినప్పటికీ అధికరణ19 (1) ప్రకారం పౌరులందరికీ కల్పించిన భావ ప్రకటన స్వే చ్ఛలో భాగంగా దీనిని పేర్కొంటారు. రాజ్యాం గం అమలులోకి వచ్చిన కొత్తలో ‘క్రాస్‌రోడ్స్’ అనే వారపత్రిక విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ విష యం వెల్లడైంది.

భారత్‌లో పత్రి కా స్వేచ్ఛను కా పాడడానికి 1966 నవంబర్ 16న ‘ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పరిచారు. 1978లో దీనిని చట్టం గానూ మార్చారు. ఈ రకంగా పత్రికా స్వేచ్చను కాపాడే ప్రయ త్నం జరిగింది. ఇండియాలో ప్రతి ఏటా నవంబర్ 16న ‘జాతీయ ప్రెస్ దినోత్సవం’ కూడా జరుపుకుంటాం.

151వ స్థానంలో భారత్

ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ తీరు తెన్నులను తెలిపే ‘వరల్డ్ ప్రెస్ ఫ్రీడం’ ఇండెక్స్‌ను ప్యారిస్‌లోని ‘రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్’ సంస్థ ప్రతి ఏటా విడుదల చేస్తుంది. తాజాగా విడుదల చేసిన పత్రికా స్వేచ్ఛ సూచీలో 180 దేశాలకుగాను భారత్ 151వ స్థానంలో నిలిచింది. గతేడాది ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ’ సమావేశంలో యు నెస్కో ‘ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ జర్నలిస్టులపై హింస పెరుగుతున్నట్లు’ ఓ నివేదికను విడుదల చేసింది.

గత 15 సంవత్సరాలలో ప్ర  పంచవ్యాప్తంగా పర్యావరణ జర్నలిస్టులలో 44 మంది హత్యకు లోనయ్యార  ని పేర్కొంది. ఇది ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో అత్యధిక జర్నలిస్టుల హ త్యల సంఖ్యను చూపిస్తున్నది. భూగోళ సంరక్షణలో పర్యావరణ నష్టంపై వార్తలు వెలికి తీయడమే ఈ దురాగతానికి కారణమని చెప్పాలి.

బాధ్యతను గుర్తించాలి

నేడు ప్రజా చైతన్యానికి పెద్దపీట వేస్తున్న పత్రికలు మరింత బాధ్యతాయుతంగా మెదలుతూ, విశ్వసనీయత ను చాటుకోవాల్సిన అవసరం ఎంతై నా ఉంది. మెజార్టీ ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేయాలి. భాగస్వామ్య పార్టీల ఒత్తిళ్లతో, ప్రతిపక్షాల ఎత్తుగడలతో సతమతమవుతున్న నేటి ప్రభు త్వాలకు మన పత్రికలు ఎజెండా త యారు చేసి సమర్పించే విధంగా ఉండాలి.

పేదల కష్టాలను, నిరుద్యోగుల వెతలను, అధికారుల అవినీతిని ప్రజలు, ప్రభుత్వాల ముందు ఉంచా లి. దేశంలోని క్షేత్రస్థాయి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా ప త్రికలు వ్యవహరించాలి. ఇటీవల ప్ర పంచీకరణ నేపథ్యంలో ప్రభుత్వాల కనుసన్నల్లో నడిచే పత్రికల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ, పేదల వార్తలను విస్మరిస్తూ ధనికుల వార్తలకు ప్రాధాన్యం ఇస్తున్నారనే వి మర్శలు వస్తున్నాయి.

విలువలకు తిలోదకాలు ఇస్తూ ప్రభుత్వ విధానాలను ఢంకా మోగించే కరపత్రాలుగా పత్రికలు మారుతున్నాయనే ప్ర చారమూ జరుగున్నది. కొన్ని సందర్భాలలో స్వేచ్ఛ పేరు తో పత్రికలు వాస్తవాలను కూడా వక్రీకరిస్తున్నాయి. అంతేకాక, పెయిడ్ న్యూస్ వల్ల పత్రికలు తను ఉనికిని కోల్పోతున్నాయి. 

కనుక, అవి ఇప్పటికైనా బాధ్యతాయుతంగా నడుచుకోవాలి. విశ్లేషకుల అంచనా ప్రకారం ఇటీవలీ కాలంలో ప్రపంచవ్యాప్తంగా పత్రికా రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. దీనికి ముఖ్యకారణం ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల విస్తృతి పెరగడమే.

ప్రజాభిప్రాయాన్ని సరిగా ప్రతిబింబించని పత్రికలు ప్రజలకు దూరమవు తాయనే విషయాన్ని గమనంలో ఉంచుకొని ఈ మేరకు నాణ్యమైన సేవలు అందించాలి. ప్రభుత్వాలు జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి. ప్రజాస్వా మ్య వికాసానికి పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో ఇది వర్ధిల్లడానికి ప్రజాస్వామ్యం అంతే అవసరం.