calender_icon.png 7 June, 2025 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక సమతుల్యతే లక్ష్యంగా!

03-05-2025 12:00:00 AM

భారతదేశ సామాజిక రాజకీయ దృశ్యాన్ని పునర్నిర్వచించేందుకు రాబోయే జాతీయ జనాభా గణ నలో కుల ఆధారిత గణనను చేర్చనున్న ట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ చ ర్యను అన్ని  రాజకీయ, సామాజిక వర్గాలు స్వాగతించారు. మేధావులు, నిపుణులు ప్రతిపక్ష నాయకులు దీనిని డేటా ఆధారిత సామాజిక న్యాయం, సమాన విధాన రూ పకల్పన వైపు చాలా అవసరమైన అడుగుగా  ప్రశంసించారు.

భారతదేశంలో కు లం అత్యంత ప్రభావవంతమైన సామాజి క నిర్మాణాలలో ఒకటిగా ఉంది. కానీ, కుల జనాభాపై సమగ్ర డేటా దాదాపు ఒక శతాబ్దంగా లేదు. జనాభా గణన 1951 నుంచి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై డేటాను సేకరిస్తూనే ఉన్నప్పటికీ, ఇతర వెనుకబడిన తరగతులు, కులసమూహాలపై సమాచారం అధికారికంగా నమో దు కాలేదు.

ఇలాంటి డేటా లేకపోవడం వల్ల ప్రభావవంతమైన విధాన రూపకల్ప న, వనరులు, రిజర్వేషన్ల సమాన పంపిణీకి ఆటంకం కలిగిందని సామజిక శాస్త్రవేత్తలు, మేధావులు అంటున్నారు. 

భారతదేశ జనాభా గణన ఇప్పటికే వయసు, లింగం, విద్య, మతం, వృత్తి వం టి పరిమితులపై సమాచారాన్ని సేకరిస్తుంది. ఓబీసీలు ఇతర కుల సమూహాల కోసం ఒక కాలమ్‌ను జోడించడంతో ఓబీసీలు ఎంత శాతం ఉన్నారనీ తెలుస్తుంది. స్వాతంత్య్రానికి ముందు, అలాగే భారతదేశ విభజనకు ముందు చివరి కుల ఆధా రిత జనాభా గణన 1931లో జరిగింది. స్వాతంత్య్రం తర్వాత, ఎస్సీలు, ఎస్టీలు త ప్ప కులగణనను తొలగించారు.

2011లో యుపీఏ  ప్రభుత్వం సామాజిక- ఆర్థిక కులగణన నిర్వహించింది, కానీ, డేటా ఖచ్చి తత్వం లేకపోవడం,  అంతర్గత వ్యత్యాసాలపై ఆందోళనల కారణంగా  కుల సమా చారాన్ని విడుదల చేయలేదు. 2011 డేటాను విశ్లేషించడానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2015లో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసినా ఫలితాలు వెలుగులోకి రాలేదు.

పరిపాలనా సంక్లిష్టత, సామాజిక సున్నితత్వాన్ని పేర్కొం టూ, కేంద్రం సంవత్సరాలుగా కులగణన కోసం పెరుగుతున్న డిమాండ్లను ప్రతిఘటించింది. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ  ప్రకటన ఒక ముఖ్యమైన విధానమార్పును సూచిస్తున్నది. 

చారిత్రాత్మక నిర్ణయం

దశాబ్ద జనాభా లెక్కింపులో కులగణనను చేర్చడాన్ని కేంద్రమంత్రి అశ్విని వైష్ణ వ్ ధృవీకరించారు. సామాజిక అసమానతలను నివారించడానికి ఇది పారదర్శకం గా, నిర్మాణాత్మక పద్ధతిలో జరుగుతుందని నొక్కి చెప్పారు. ఇదొక చారిత్రాత్మక నిర్ణయం. వెనుకబడిన వర్గాలు జనాభాలో దాదాపు మూడింట రెండు వంతుల మం ది ఉన్నారని బీహార్ రాష్ట్ర సర్వే వెల్లడించింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ పారదర్శక కులసర్వేకు నాయకత్వం వహిం చి డేటాను ప్రచురించారు.

ఈ చర్య రాష్ట్రస్థాయి ప్రయత్నాలకు ధృవీకరణ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని తన మ్యానిఫెస్టోలో చేర్చింది. రాహుల్‌గాంధీ కులగణ నను జాతీయ సమస్యగా మార్చారు. కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలు సమగ్ర కులగణన చేసి మార్గాన్ని చూపించాయి. ఇప్పుడు కేంద్రం కూడా దానిని అనుసరించింది. తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఇప్పటికే కుల సామాజిక-ఆర్థిక డేటాను ఉపయోగించుకుని రిజర్వేషన్లపై 50 శా తం పరిమితిని సవరించాలని ఒత్తిడి చేశాయి.

జాతీయ స్థాయిలో ఇలాంటి సర్వేల ను అమలు చేయడం ద్వారా మరింత ముందుకు సాగాలని అక్కడి నాయకులు కేంద్రాన్ని కోరారు. ఈ డేటా రాబోయే సంవత్సరాల్లో రిజర్వేషన్ కోటాలు, సంక్షే మ పథకాలు, వనరుల కేటాయింపులను ప్రభావితం చేస్తుంది.

రిజర్వేషన్ సంబంధ కేసులలో వాస్తవిక డేటా అవసరాన్ని సుప్రీంకోర్టు పదేపదే నొక్కి చెబుతుండటంతో గత్యంతరం లేక కేంద్రం సమగ్ర కులగణనకు ఒప్పుకుంది. భారతదేశం తన తదుపరి జనాభా లెక్కలకు సిద్ధమవుతున్న తరుణంలో, కులగణనను చేర్చడం కేవలం అధికారిక నవీకరణ మాత్రమే కాదు, ఇది దేశం సామాజిక సమానత్వాన్ని సాధించడంలో కీలకమైన క్షణం. 

పూర్తి స్పష్టత రావాలి

ఈ మేరకు పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టి, దేశంలో ఆయా వర్గాల వారీ గా ప్రజల వివరాలు, వారి ఆర్థిక స్థితిగతులు, వాళ్లు పొందుతున్న సంక్షేమ పథకా లకు చెందిన పూర్తి సమాచారం ప్రభుత్వం సేకరించాలి. ఎంతమంది ఏ సామాజిక వర్గానికి చెందిన వారున్నారు, వారి ఆర్థిక పరిస్థితితోపాటు విద్య, ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయని పూర్తి వివరాలు సేకరించాలి.

దీనివల్ల ప్రస్తుతం అమలయ్యే సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన లబ్ధిదారులకు చేరుతున్నాయా లేదా అవకతవకలు జరుగుతున్నాయా? అన్న విషయాలపై ఓ క్లారిటీ రావడమే కాక ప్రభుత్వం అమలు చేసిన కొత్త పథకాల విషయంలో ఏ సామాజిక వర్గానికి ఎంత న్యాయం చేయాలన్న సమాచారమూ లభిస్తుంది. దీంతో అన్యాయం జరిగిన వర్గాల కూ న్యాయం చేకూర్చే అవకాశం ఉంటుంది.

రాజకీయ పరంగా ఏ సామాజిక వర్గం వెనుకబడి ఉంది, ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది అన్న అంశాలపైనా ఓ స్పష్టత వస్తుంది.  ఆధిపత్య శక్తులు తమ దామాషాకు మించి మూడు నాలుగు రెట్ల అవకాశాలను పొందుతున్న నేపథ్యంలో, గత ఏడు దశాబ్దాల రాజ్యాంగ పాలనలో, ఎవరి హక్కుల కోసం వారు, ఎవరి ఆధిపత్యం కోసం వారు పరిమితమై పోతుండ గా, ఇతరులకు కరివేపాకు లాగే మిగిలి పో తున్న బీసీ వర్గం, తమ హక్కులు తాము దక్కించుకోవాలంటే.. అనే దానికి సరైన సమాధానం కావాలి. 

బీసీ కులాల అస్తిత్వ నిర్మాణం చిక్కబడాలి. వారి మధ్య అంతర్గత ఐక్యత పెరగా లి. ఈ రెండూ జరగడానికి వీలుగా, దా మాషా హక్కుల కోసం సమిష్టి కృషి కొనసాగిస్తునే, దొరుకుతున్న అవకాశాలు బీసీ కులాల మధ్య సమానంగా పంపిణీ జరగాలి. సరైన నాయకత్వ నిర్మాణం వారికి కావాలి. జాతీయ స్థాయిలో, బీసీలకు సరైన గుర్తింపు దొరకాలి. అది జాతీయ స్థాయిలో, బీసీ సంఘాన్ని వ్యవస్థీకృతం చేయకుండా వీలు కాదు.

ఎంత కృషి చే యకలిగినా ఒకరిద్దరు లేక కొందరు పరిమిత కృషి మాత్రమే సరిపోదు. వ్యవస్థీ కృత నిర్మాణం ద్వారా, బీసీ కీలక సమస్య ల పరిష్కారానికి ఉద్యమాలు జరగాలి. అంతిమంగా, బీసీ నాయకత్వంలో బలమైన రాజకీయ వేదిక నిర్మాణం జరగాలి. తద్వారా జాతీయ స్థాయిలో బీసీలకు రా జ్యాధికారం చేపట్టాలి. దాంట్లో ఎవరి దా మాషా హక్కులు వారికి చెందాలి. అదే సమసమాజ నిర్మాణానికి దోహదం చేస్తుంది. 

అందరికీ న్యాయం జరగాలి

బీసీలు వారికి చెందవలసిన అవకాశాలు వారికి దొరకడానికి ఇలాంటి కృషి చాలా అవసరం. కులాలు ఉపకులాల వా రంతా ఐక్యం కావాలి. కేవలం 8 శాతం ఉ న్న అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన బీజేపీ ప్రభుత్వం 57 శాతం ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్లకు పరిమితం చేశారు. తరతరాలుగా, బీసీలు విద్య, రాజకీయాలు, వ్యాపారంతోసహా వివిధ రంగాలలో అన్యాయానికి గురవుతున్నారు.

విద్య వైద్యం ఉపాధి రంగాలలో ప్రభుత్వాల చేయూత లేకపోవడంతో అప్పులపాలై జీవితాలు దుర్భరంగా తయారయ్యాయి. ఓబీసీలు అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. వారిలో డ్బుభై శాతం ఇప్పటికీ పేదరికంలో జీవిస్తున్నారు. స్వచ్ఛమైన నీరు, పారిశుధ్యం వం టి కనీస సౌకర్యాలు అందుబాటులో లేవు. వివక్ష, హింసలకు గురవుతున్నారు. దేశం లో బీసీలది సంక్లిష్టమైన  బహుముఖ సమస్య.

వారు వివిధ రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించినప్పటికీ, అనేక సవాళ్లు మిగిలి ఉన్నాయి. ఆకలి, అజ్ఞానం, అమాయకత్వం, అనారోగ్యం, పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం జరగాలంటే జాతి, వనరులు, సంపద, అధికారం అన్ని వర్గాలకూ సమానంగా ద క్కాలి. శ్రమ సంస్కృతి పెరగాలి. మానవ వనరులు పూర్తి స్థాయిలో వాడుకోవాలి. శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కాలి.