20-12-2025 02:19:21 AM
సంతాపం వ్యక్తం చేసిన కేసీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 19: ప్రఖ్యాత భారత శిల్పి రామ్ వాంజీ సుతార్ కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్ నోయిడాలోని కుమారుడి నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. 1925 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని గోందూర్లో ఆయన జన్మించారు. రామ్ సుతార్ను 1999లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. గుజరాత్లోని నర్మదా జిల్లాలోని ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ(వల్లభాయ్ పటేల్),హైదరాబాద్లోని ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, బెంగళూరు విమానాశ్రయంలోని ‘కెంపె గౌడ’ విగ్రహాలను రామ్ సుతార్ రూపొందించారు. శిల్ప కళారంగంలో
సుతార్ కోహినూర్ వజ్రం: కేసీఆర్
బీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికి గర్వంగా నిలబెట్టిన, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ రూప శిల్పి, పద్మ భూషణ్, రామ్ వంజీ సుతార్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ప్రముఖుల విగ్రహాలకు రూపం పోసి, ప్రపంచ స్థాయి ప్రతిభను కనబరిచి, శిల్ప కళా రంగంలో కోహినూర్ వజ్రంగా పోల్చదగిన రామ్ సుతార్ శిల్ప కళా సేవలను, బాబా సాహెబ్ అంబేద్కర్ రూపంలో తెలంగాణ రాష్ర్టం వినియోగించుకోవడం గర్వ కారణమని కొనియాడారు.
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, తెలంగాణ రాష్ర్ట చరిత్రలో నిలిచిపోయేలా డాక్టర్ అంబేద్కర్ స్ఫురద్రూపాన్నీ 125 అడుగుల ఎత్తులో, అత్యంత సుందరంగా మనోహరంగా తీర్చిదిద్దిన, రామ్ సుతార్ తెలంగాణ ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారని తెలిపారు. వారి మరణం, శిల్ప కళా రంగానికి తీరని లోటని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. రామ్ వంజీ సుతార్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.