17 April, 2026 | 10:34 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ధాన్యం లారీల‌కు ప్ర‌త్యేక సీరియ‌ల్ నంబ‌ర్ కేటాయించాల‌ని ఇంచార్జ్ తాసీల్దార్‌కు విన‌తి..

06-05-2025 08:40 PM

మునుగోడు (విజయక్రాంతి): మునుగోడు మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఎత్తుకున్న లారీలకు ప్రత్యేకమైన సీరియల్ నంబరు కేటాయించాలని కోరుతూ మునుగోడు మండలం లారీ అసోసియేషన్(Munugode Mandal Lorry Association) సభ్యులు మంగళవారం ఇన్చార్జ్ తాహసీల్దార్‌ నేలపట్ల నరేష్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లారీ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. మునుగోడు మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇక్కడనే ఉన్న రైస్ మిల్లుకు ధాన్యాన్ని దిగుమతి చేసే అవకాశం కల్పించాలని, అయితే ఇక్కడ ధాన్యం ఎత్తుకున్న లారీలు మిల్లుకు చేరుకునే లోగా చండూరు, కనగల్లు, నల్లగొండ మండలాల నుంచి కూడా ధాన్యాన్ని ఎత్తుకున్న లారీలు ఇదే మండలానికి వ‌స్తున్న‌ట్లు తెలిపారు.