calender_icon.png 20 June, 2025 | 1:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

05-06-2025 12:54:44 AM

కలెక్టర్ జితేష్ వి. పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 4 (విజయ క్రాంతి) భూ సమస్యలు ఉన్నవారు రెవెన్యూ సదస్సులో పాల్గొని దరఖాస్తులు అందజేసిన వెంటనే భూ సమస్యలు పరిష్కారం చేస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పేర్కొన్నారు. జూన్ 20 వరకు నిర్వహించు రెవిన్యూ సదస్సు లలో భాగంగా లక్ష్మిదేవిపల్లి మండలం బంగారు చిలక గ్రామంలో నిర్వహిస్తున్న భూ భారతిలో భూ సమస్యలపై రైతులు ఇచ్చిన దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ రెవెన్యూ సదస్సులో భూ రికార్డులలో పేర్లు తప్పులు, భూమి విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్-బిలో చేర్చిన భూముల సమస్యలు,

భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించి భూ భారతి కొత్త ఆర్.ఓ.ఆర్ చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతారన్నారు. అలాగే నిర్దేశిత గడువు లోపు భూములు పరిష్కరిస్తారన్నారు. అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తహసీల్ధార్ను అదేశాంచారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట కొత్తగూడెం ఆర్డీవో మధు, లష్మిదేవిపల్లి తాసిల్దార్ , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.