calender_icon.png 6 June, 2025 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం

13-03-2025 09:54:11 PM

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల వేసవిలో వడదెబ్బ గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై మండల స్థాయి అధికారుల టాస్క్ ఫోర్స్ (నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ క్లెయిమంట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్) గురించి మునగాల తాసిల్దార్ కార్యాలయంలో మండల అధికారులతో ఎమ్మార్వో వి.ఆంజనేయులు, ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ లు కలసి సమావేశం నిర్వహించారు. ఈ వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు ఉదయం 11 గంటల లోపు సాయంత్రం 4 గంటల తరువాత పనికి వెళ్ళాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు ,చిన్న పిల్లలు 60 సంవత్సరాల పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాదులతో బాధబడుతున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

వడదెబ్బ లక్షణాలు చెమట పట్టక పోవడం, శరీర ఉషోగ్రత పెరగడం, వణకు పుట్టడం,మగతగా ఉండడం, పిట్ రావడం, పాక్షికంగా అప్ష్మరక లోకి వెళ్ళడం జరుగుతుంది అని వివరించడం జరిగింది. తరుచుగా మంచినీళ్ల త్రాగడం, మజ్జిగ, నిమ్మ రసం, కొబ్బరి నీళ్లు, పల్ల రసాలు తీసుకోవాలని సూచించడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో బయటికీ వెళితే, కాళ్ళకు చెప్పులు ధరించడం,టోపి, గొడుగు, తేలిక పాటి తెల్లని కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు. రోడ్ల పై దొరికే పానీయాలు తీసుకోకూడదని కోరారు. ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు,పోస్ట్ ఆఫీస్, ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ డీలర్, ఓఅర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం జరిగిందని అత్యవసర పరిస్థితుల్లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం యందు వైద్య సేవలు వినియోగించు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ పి. రవీందర్, ట్రైనీ ఎస్.ఐ గోపాల్ రెడ్డి, రేపాల ఆరోగ్య విస్తరణ అధికారి బి భాస్కర్ రాజు, సూపర్ వైజర్స్  శ్రీనివాసులు, జయమ్మ, హెల్త్ అసిస్టెంట్ కృష్ణ పాల్గొన్నారు.