06-06-2025 05:39:21 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలో శనివారం నుండి రెండు రోజులపాటు శ్రీశ్రీశ్రీ శీతల పరమేశ్వరి బొడ్రాయి వార్షిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేయడం జరిగింది. వార్షిక ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు శనివారం ఉదయం గణపతి పూజ, పుణ్యావచనం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బొడ్రాయికి ఆడపడుచులతో పాలు, పెరుగు, నీళ్లు పోసే కార్యక్రమం నిర్వహించనున్నారు.
అదేవిధంగా 8వ తేదీన ఆదివారం రోజున ఉదయం 10 గంటల నుండి ఊరి బోనాలు తీయడం జరుగుతుందని ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు బత్తిని సహదేవ్, కంకల కిష్టయ్య, కొండూరు భాస్కర్, అయిటిపాముల రవీంద్ర, బత్తిని సత్యనారాయణ, మైసోల్లా యాదగిరి, కాసుల వెంకటేశం, ఏమే మల్లేశం, బంధారపు లింగస్వామి, కొండూరు అంజయ్య తదితరులు పాల్గొన్నారు.