calender_icon.png 7 June, 2025 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొన్నారం లో బడిబాట

06-06-2025 05:26:05 PM

మందమర్రి,(విజయక్రాంతి): మందమర్రి మండలంలోని పొన్నారం గ్రామం(Ponnaram Village)లో బడిబాట కార్యక్రమంలో భాగంగా నూతన విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. శుక్రవారం గ్రామంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమం(Badibata Program)లో ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలు గ్రామస్థులకు వివరించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి దత్తుమూర్తి(Mandal Education Officer Dattu Murthy) మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు.

పాఠ్యపుస్తకాలతో పాటు, ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం ఉచితంగా అందిస్తుందన్నారు. అన్ని రకాల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తుందని, గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పది మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయు లు పి శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి హరీష్, అంగన్వాడీ టీచర్ సునీత,ఫీల్డ్ అసిస్టెంట్ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఈద లింగయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.