06-06-2025 05:36:38 PM
ఎంఈఓ భాస్కర్
వలిగొండ,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివించి పిల్లల సమగ్ర అభివృద్ధికి తోడ్పడుదామని ఎంఈఓ సుంకోజ్ భాస్కర్(MEO Sunkoj Bhaskar) అన్నారు. శుక్రవారం వలిగొండ మండల కేంద్రంలో ఎంఈఓ భాస్కర్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల ఇంటింటికి తిరిగారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో అందించే సౌకర్యాలను తెలియజేశారు నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లోని లభిస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana State Government) ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టిందని విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను అందిస్తుందని ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతంకై కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులలో చదివే విద్యార్థులలో సామాజిక స్పృహ కలిగి ఉంటారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఎంతోమంది ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పోలేపాక నాగేందర్, ఎం.డి జిలాని, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.