calender_icon.png 6 July, 2025 | 12:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మిక క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

05-07-2025 07:44:30 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఆర్టీసీ నిర్మల్ డిపో నుండి ఆధ్యాత్మిక క్షేత్రాలయినా కానిపాకమ్, అరుణాచలం, పలని, పాతాళషెంబు, మధుర మీనాక్షి,రామేశ్వరం, శ్రీరంగం,భద్రాచలం,అన్నవరం, శ్రీశైలం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపోమేనేజర్ కే పండరి తెలిపారు. ఈ నెల 10 న గురుపౌర్ణిమ ఉన్నందున అరుణాచలం గిరిప్రదక్షిణ కొరకు నిర్మల్ నుండి 9 వ తేదీ మ!! ఒంటి గం!!కు అరుణాచలం బస్సు నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ బస్సు 9 వ తేదీన నిర్మల్ నుండి బయలుదేరి 10 తేదీ ఉద!! 7 గం!!లకు కానిపాకం చేరుకుంటుందని వరాహసిద్దీవినాయక దర్శనం అనంతరం వెల్లూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం సాయంత్రం అరుణాచలం చేరుకుంటుంది. అక్కడ అరుణాచలేశ్వరుని దర్శనం గిరిప్రదక్షిణ ముగించుకొని మరుసటి రోజు బయలు దేరి గద్వాల్ జిల్లా అలంపూర్ జోగులాంబ ను దర్శించుకొని నిర్మల్ చేరుకుంటుందని అయిన తెలిపారు. ఛార్జి ఒకరికి 4900/- ఉంటుందని అయిస తెలిపారు.భోజన వసతి ఖర్చులు ప్రయాణికులే పెట్టుకోవాలని సూచించారు.

మరొక బస్సు 16 జులై రోజు నిర్మల్ నుండి బయలుదేరి కానిపాకం, అరుణాచలం, పలని, పాదాలషెంబు కరంగిల్ మాల, మధుర మీనాక్షి, రామేశ్వరం, శ్రీరంగం రంగనాయ విష్ణు మూర్తి దర్శనం చేసుకొని 21 తేదీ సాయంత్రం నిర్మల్ చేరుకుంటుందని ఆయన తెలిపారు. ఈ ప్యాకేజ్ ఒకరికి 7500/- ఉంటుందని భోజన, వసతి ఖర్చులు ప్రయాణికులే భరించాలని ఆయన తెలిపారు. అలాగే 9 జులై రోజు రాత్రి 8 గం!!లకు శ్రీశైలం నడుపుతున్నామని నిర్మల్ నుండి రాత్రి 8 గం!!లకు బయలుదేరి ఉద!! శ్రీశైలం చేరుకొని దర్శనం చేసుకొని సాయంత్రం శ్రీశైలం నుండి బయలుదేరి తెల్లవారుజామున నిర్మల్ చేరుకుంటుందని ఛార్జి ఒకరికి 2250/- రూ!! లు ఉంటుందని తెలిపారు. ఇవి కాకుండా వీటి తర్వాత భద్రాచలం, అన్నవరం, ప్రయాగ్ రాజ్, అయోధ్య, కాశీ, మొదలగు పుణ్య క్షేత్రలకు ప్రత్యేక బస్దులు నడుపుతామని ప్రయాణికు ఈ సదవకాశాన్ని సద్వినియోగ పరచుకొని మీ మొబైల్ లో కానీ మా రిజర్వేషన్ కౌంటర్ లో గాని ముందస్తుగా  టికెట్ బుక్ చేసుకోవాలని డిపోమేనేజర్ తెలిపారు.