26-01-2026 08:48:10 PM
జవహర్ నగర్,(విజయక్రాంతి): జవహర్ నగర్ ఏసీపీగా ఎస్.చక్రపాణి నియామితులయ్యారు. ఈ మేరకు పోలీసుశాఖ ఒక ప్రకటనలో తెలిపారు. మల్కాజిగిరి ఏసీపీగా పనిచేస్తున్న చక్రపాణి నూతనంగా ఏర్పడినటువంటి జవహర్ నగర్ కు బదిలీపై వచ్చారు. ఈమేరకు బాధితులకు సత్వర సేవలు అందజేస్తూ శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతామని ఏసీపీ చక్రధర్ తెలిపారు. పోలీసు ప్రతిష్టను పెంచే సరికొత్త విధానాలతో ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.