23 June, 2026 | 7:49 PM

Breaking News

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •  

మధురానగర్ లో వైభవంగా కుంకుమ పూజ, గణపతి కళ్యాణం

06-09-2025 09:18 AM

ఖమ్మం (విజయ క్రాంతి): ఖమ్మం మధురనగర్ సాయిబాబా మందిరం లో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం, రాత్రి గణపతి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు సామూహిక కుంకుమ పూజ లో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కుంకుమ పూజ అనంతరం బాబావారి మధ్యాహ్న హారతి తరువాత బాబా వారి మహా అన్నప్రసాదం వితరణ  చిత్తారు శ్రీనివాసరావు కృష్ణవేణి దంపతులచే నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. రాత్రి 8 గంటలకు వినాయక స్వామి కల్యాణమహోత్సవం అంగరంగా వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డి సి సి బి మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, 14 వ డివిజన్ కార్పొరేటర్ కూరాకుల వలరాజు, ఆలయ కమిటీ సభ్యులు, మధురానగర్ శ్రీనగర్ రోటరీనగర్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.