03-01-2026 09:32:18 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిద్దామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సావిత్రిబాయి పూలే 195వ జయంతి పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశం మందిరంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా ఉపాధ్యాయుల దినోత్సవానికి జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి లక్ష్మీనారాయణ, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్లా మంగతో కలిసి హాజరై సావిత్రిబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... బాలికా విద్యను ప్రోత్సహిస్తూ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి.