15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు

03-01-2026 04:32 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని బాపూనగర్‌లో అరిగెల నివాసంలో శనివారం సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి  వన్ నేషన్–వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరావు, భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మిన మహానీయురాలు సావిత్రిబాయి ఫూలే అని కొనియాడారు.

ఆమె తన భర్త జ్యోతిరావు ఫూలేతో కలిసి 1848 జనవరి 1న పుణేలో దేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించి మహిళా విద్యకు బాటలు వేశారని తెలిపారు. నిరక్షరాస్యురాలిగా ఉన్న సావిత్రిబాయికి ఆమె భర్త జ్యోతిరావు ఫూలే తొలి గురువుగా నిలిచి, ఇంట్లోనే అక్షరాభ్యాసం చేయించి విద్యావంతురాలిని చేశారని చెప్పారు. అనంతరం ఆమె ఆధునిక భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా గుర్తింపు పొందిందని, పీడిత వర్గాలు, ముఖ్యంగా మహిళల విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన తొలి తరం మహిళా ఉద్యమకారిణి అని అన్నారు. సావిత్రిబాయి ఫూలే జీవితం ప్రతి మహిళకు ఆదర్శంగా నిలవాలని  ఆకాంక్షించారు.