24 June, 2026 | 2:17 PM

Breaking News

తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •   పేపర్ మిల్లు అంశంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది   •  

రైతుల ఎదుగుదలకు ఎస్బిఐ కృషి

23-12-2025 09:34 PM

ఎస్బిఐ వరంగల్ రూరల్ ఏజియం ఏఎన్ వి.సుబ్బారావు

రేగొండ,(విజయక్రాంతి): రైతుల ఎదుగుదలకు ఎస్బిఐ బ్యాంక్ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎస్బిఐ బ్యాంక్ వరంగల్ రూరల్ ఏజిఎం ఏఎన్ వి.సుబ్బారావు అన్నారు. మంగళవారం ప్రపంచ రైతు దినోత్సవ సందర్భంగా ఎస్బిఐ ఆధ్వర్యంలో అన్నదాత ఉత్సవం కార్యక్రమాన్ని రేగొండ మండలం రేపాక రైతు వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.వి సుబ్బారావు మాట్లాడుతూ రైతులు అధునాతన టెక్నాలజీ వైపు అడుగులు వేసి వ్యవసాయాన్ని వృద్ధి చేసుకోవాలని కోరారు.

వ్యవసాయంలో ముఖ్యంగా డ్రోన్ స్ప్రేయర్, హార్వెస్టర్, సోలార్ వంటి పరికరాలను పిఎంజిఈపి స్కీం ద్వారా అందిపుచ్చుకొని రైతులు లాభాల బాటలో సాగాలని ఆయన పేర్కొన్నారు.రైతులు రుణాల విషయంలో నిర్ణీత సమయంలోగా చెల్లింపు చేసుకోవాలని గత పది సంవత్సరాలుగా లోన్ తీసుకొని సరైన సమయంలో రెన్యువల్ చేసుకున్న ఐదుగురు రైతులను బ్యాంకు సిబ్బంది సన్మానించారు.ఈ కార్యక్రమంలో పరకాల ఎస్బిఐ ఏసిబి చీఫ్ మేనేజర్ రవి, డిప్యూటీ మేనేజర్ శ్రీనివాస్, ఫీల్డ్ ఆఫీసర్ నిఖిల్, సి ఎస్ పి పాయింట్ నిర్వాహకులు మడప మమత, సంపత్ రెడ్డి, భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, గ్రామ సర్పంచ్ గుల్ల స్వప్న తిరుపతి, ఉప సర్పంచ్ వెంగల నరసయ్య, మాజీ సర్పంచ్ పోనగంటి తిరుపతి, రైతులు పాల్గొన్నారు.