10 May, 2026 | 5:48 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు

30-07-2025 12:14 AM
  1. అన్నను ఎక్కించి, అదే బస్సు కింద పడి మృతి
  2. భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలో ఘటన

మహదేవపూర్ (భూపాలపల్లి) జూలై 29 (విజయక్రాంతి): తన అన్నను స్కూల్ బస్సు ఎక్కించి, అదే బస్సు కింద పడి చిన్నారి మృతిచెందిన ఘటన భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలో మంగళవారం జరిగింది. ఎస్సై పవన్ కుమార్ తెలి పిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబటిపల్లికి చెందిన సింగనేని మల్లేష్‌ెే-భాగ్య దంపతుల కుమారుడు అరవింద్ సూరారం గ్రామంలోని శివచంద్ర విద్యా మందిర్‌లో చదువుతున్నాడు.

మంగళవా రం ఉదయం అరవింద్‌ను బస్సు ఎక్కించడానికి తల్లి భాగ్య రాగ తల్లి వెంబడి కూతు రు తేజస్విని(3) వచ్చింది. అన్నను స్కూల్ వ్యాన్ ఎక్కించి బాయ్ చెప్పుకుంటూ స్కూల్ వ్యాన్ పక్కకు వెళ్లింది. గమనించని డ్రైవర్ బస్సును పోనివ్వడంతో వెనుక చక్రాల కింద పడి చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. అప్పటివరకు కేరింతలతో తమ వెంట ఉన్న చిన్నారి పాప కళ్లెదుటే రక్తపు మడుగులో విగత జీవిగా మార డంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

వ్యాన్ డ్రైవర్ పరారు కావడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచా రం అందించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహాదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తండ్రి మల్లేష్ ఫిర్యాదుతో వ్యాన్ డ్రైవర్ వలి మహ్మద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.