07-06-2025 12:00:00 AM
ఈనెల 12న పాఠశాలలు పునః ప్రారంభమవుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో దడ మొదలైంది. ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్స్, బ్యాగులు ఇతర సామగ్రి కొనాలంటే తల్లిదండ్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలలపై ప్రభుత్వానికి, అధికారులకు నియంత్రణ లేకపోవడంతో ఫీజుల భారం పెరిగింది. ‘ఏడాది సంపాదనంతా బడికేనా’ అని వారు వాపోతున్నారు. ప్రతి సంవత్సరం విధిగా స్కూలు ఫీజులు పెంచడం అన్యాయం. యాజమాన్యాలు సాధారణ ఫీజుతోపాటు డొనేషన్లు, బస్సు చార్జీలు కూడా వసూలు చేస్తారు.
కామిడి సతీష్రెడ్డి భూపాల్ పల్లి జిల్లా