calender_icon.png 25 October, 2025 | 12:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీలీ ఇండియా నూతన పోస్చర్ అడ్వాన్స్ శ్రేణి ఆవిష్కరణ

25-10-2025 12:34:30 AM

హైదరాబాద్: అక్టోబర్ 24(విజయక్రాంతి): ప్రపంచంలోనే నంబర్ 1 అమ్ము డవుతున్న మ్యాట్రెస్ బ్రాండ్‌లో భాగమైన సీలీ ఇండియా ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ భారత మార్కెట్‌లోకి తన కొత్త పోస్చర్ అడ్వాన్స్ శ్రేణిని ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ నైపుణ్యంతో భారతదేశంలో తయారు చేయబడిన ఈ కొత్త శ్రేణి, పోస్చర్‌పెడిక్ మరియు పోస్చర్‌సెన్స్ శ్రేణుల క్రింద 20కి పైగా ఉత్పత్తులను కలిగి ఉన్న సీలీ విస్తరిస్తున్న ప్రీమియం పోర్ట్‌ఫోలియోకు తాజా చేర్పు.ఈ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ కార్యక్రమానికి నటి అండ్ మోడల్   రూమా శర్మ ముఖ్య అతిథిగా, సీలీ ఇండియా నేషనల్ సేల్స్ హెడ్ కుశాల్ సింగ్ యాదవ్, మార్కెటింగ్ హెడ్ సోనాలిడే, సీలీ ఇండియా బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీలీ ఇండియా నేషనల్ సేల్స్ హెడ్ కుశాల్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ సీలీ మ్యాట్రెస్లు వాటి ప్రత్యేకమైన కాయిల్ టెక్నాలజీ మరియు ప్రపంచ నైపుణ్యంతో ప్రత్యేకంగా నిలుస్తాయన్నారు.

మార్కెటింగ్ హెడ్ సోనాలిడే మాట్లాడుతూ, సీలీ పోస్చర్ అడ్వాన్స్ శ్రేణి అధునాతన మద్దతును చక్కటి సౌకర్యంతో మిళితం చేస్తుంది అని అన్నారు. భారతీయ వినియోగదారులను ఆకర్షించేలా ఆలోచనాత్మకంగా రూపొందించిన డిజైన్లు మరియు రంగులను కలిగి ఉంది అని అన్నారు.

కాగా సీలీ తన ప్రస్తుత 20 సీలీ గ్యాలరీ మరియు స్టూడియో కాంబినేషన్ స్టోర్ల సంఖ్యను వచ్చే మూడు సంవత్సరాలలో 100+ స్టోర్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. డీలర్ నెట్వర్క్లో ఈ వేగవంతమైన వృద్ధి ప్రారంభంలో 200%+ పీఏ అమ్మకాల వృద్ధికి దారితీస్తుందని అంచనా వేయబడింది.