1 August, 2026 | 6:08 PM

Breaking News

విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తున్న ప్రభుత్వం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి   •   సోనాల మండల కేంద్రానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు   •   అనురాగ్ లో కెరీర్ క్యాటలిస్ట్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఫర్ ప్లేస్మెంట్ సక్సెస్ వర్క్ షాప్   •   గోదావరి ఉధృతి.. జలదిగ్బంధంలో బూర్గంపాడు   •   వరదలు సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు తల దాచుకోవాలి   •   అడ్మిషన్ పేరుతో విద్యార్థుల నుండి పైసలు వసూలు   •   సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ క్రాంతి   •   నవజాత శిశువుకు తల్లిపాలే రక్షణ కవచం   •   ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం   •  

రెండోరోజు గ్లోబల్ సమ్మిట్.. ఫ్యూచర్ సిటీకి చేరుకున్న సీఎం

09-12-2025 10:39 AM

హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit) రెండో రోజు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఫ్యూచర్ సిటీకి చేరుకున్నారు. గ్లోబల్ సమ్మిట్ వేదికగా సీఎం రేవంత్ కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను(Telangana Thalli statue) ఆవిష్కరిస్తారు. మంగళవారం నాడు 20కిపైగా సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఆనంద్ మహీంద్రాతో ఈవీ, రూరల్ ఎంటర్ ప్రైజెస్ రంగాలపై చర్చించనున్నారు. సాయంత్రం 6 గంటలకు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించనున్నారు. రాత్రి 7 గంటలకు గిన్నిస్ రికార్డ్ డ్రోన్ షో ఏర్పాటు చేశారు. నేటి సమ్మిట్ లో రూ. లక్ష కోట్లకుపైగా ఒప్పందాలు జరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నిన్న ఒక్క రోజే రూ. 3,97,500 కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి.