14 April, 2026 | 5:14 PM

Breaking News

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •  

శాంతి విద్యానికేతన్ పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు

23-12-2025 07:00 PM

ఆళ్లపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని శాంతి విద్యనికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మంగళవారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథులుగా పునీత పేతురు, పౌల్ చర్చి తిరు హృదయ సభ విచారణ గురువులు సిద్దెల జేసు ప్రసాద్ హాజరయ్యారు. ఈ మేరకు ఏసు జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లలు వేషధారణలతో క్రిస్మస్ తాత,శాంతా క్లాజ్, క్రిస్మస్ ట్రీ పలు భక్తిగేయాలకు విద్యార్థులు నృత్యాలు చేశారు.

అనంతరం విద్యార్థులకు క్రిస్మస్ బహుమతి కానుక అందజేశారు. అనంతరం ఫాదర్ జేసు ప్రసాద్ మాట్లాడుతూ..సర్వమానవాళి కోసం డిసెంబర్ 25 రోజున జన్మదినం మహోత్సవాన్ని క్రైస్తవ భక్తులు ప్రపంచవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, నిర్వహించుకోవాలని అన్నారు. ఈకార్యక్రమంలో సిస్టర్ మహిత హెచ్.ఎం, సిస్టర్ ప్రశాంత, సిస్టర్ డామరీస్, షమీమ్, జ్యోతి, శిరోమణి, సహన, సింధు, వెన్నెల, జ్యోతిర్మయి యానిమేటర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.