calender_icon.png 25 June, 2025 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

జీడిమెట్ల అంజలి హత్య కేసులో సంచలన విషయాలు

25-06-2025 05:47:10 PM

కిడ్నాప్ కేసు పెట్టిందనే హత్య..

మీడియా సమావేశంలో బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్..

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అంజలి(39) హత్య కేసు(Jeedimetla Murder Case)లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్(DCP Suresh Kumar) మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి ఎన్ఎల్బి నగర్ లో అంజలి తన ఇద్దరి కుమార్తెలతో కలిసి నివాసముంటుంది. అంజలి తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందంలో కళాకారిణిగా గుర్తించారు. గతంలో 7 తరగతిలో ఉన్న సమయంలో తేజశ్రీ తల్లితో ఉండనని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డీసీపీ తెలిపారు. అంజలి తనను కొట్టేదని, ప్రేమగా చూసేది కాదని, రెండవ భర్త కూతురిపైనే ఎక్కువ ప్రేమ చూపించేదని వెల్లడించారు.

ఈ నెల 19న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్, కిడ్నాప్ కేసు పెట్టిందని, శివ(19), తేజశ్రీ(16) ప్రేమని ముందు ఒప్పుకొని, తర్వాత అడ్డు చెప్పడంతో ఆగ్రహానికి గురైన తేజశ్రీ హత్య చేసినట్లు పేర్కొన్నారు. ముందు అంజలిని హత్య చేద్దామని తన ప్రియుడు శివకు చెప్పగా నిరాకరించడంతో, తన మాట వినకపోతే ఆత్మహత్య చేసుకొని నీ పేరు రాస్తానని శివను బెదిరించడంతో హత్య చేయడానికి ఒప్పుకున్నాడు. పథకం ప్రకారం హత్య చేసే సమయంలో అంజలి చిన్న కూతురు ఇంట్లోనే ఉండడంతో బయటకు పంపించి శివ, అతని సోదరుడు యశ్వంత్(18) అంజలికి ఊపిరాడకుండా చున్నీని మెడకు బిగించి, సుత్తితో కొట్టి హత్య చేసినట్లు డీసీపీ వెల్లడించారు.

కొద్దిసేపటి తరువాత అంజలి చిన్న కూతురు ఇంట్లోకి వచ్చి వంటగదిలో అంజలి కిందపడి ఉండడంతో 108 ఫోన్ చేయాలని కోరినా కూడా తేజశ్రీ కాలయాపన చేసిందని తెలిపారు. నిందితులు తేజశ్రీ(16), శివ(19), యశ్వంత్(18) లపై హత్య కేసు నమోదు చేశారు. నిందితులు శివని చర్లపల్లి జైలుకి, తేజశ్రీ, యశ్వంత్ లను జవైనల్ హోమ్ తరలించామని డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. మీడియా సమావేశంలో బాలానగర్ అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి, జీడిమెట్ల సీఐ మల్లేశం, జీడిమెట్ల డీఐ కనకయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.