15 April, 2026 | 9:31 AM

వికలాంగుల హక్కుల రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ని సన్మానించిన మందకృష్ణ మాదిగ

25-06-2025 05:50 PM

చిలుకూరు: తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల హక్కుల కోసం నిరంతరాయంగా పోరాటం కొనసాగిస్తున్న చిలుకూరు మండలం(Chilkur Mandal) రామాపురం గ్రామానికి చెందిన గిద్దె రాజేష్ నీ బుధవారం హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించిన వికలాంగుల ఐక్య సంఘాల సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ(MRPS founder Manda Krishna Madiga) శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గిద్దె రాజేష్ మాట్లాడుతూ... మాదిగ, మాదిగ ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి 30 ఏళ్ల తన సుదీర్ఘ పోరాటంతో ఎస్సీ వర్గీకరణ సాధించిన ఉద్యమ నాయకుడు ఆరోగ్యశ్రీ స్ఫూర్తిదాత పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ చేతుల మీదుగా సన్మానించడం ఎంతో ఆనందంగా ఉన్నదని అన్నారు.