17-07-2025 12:46:44 AM
మంచిర్యాల, జూలై 16 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ)గా భుక్యా చత్రు నాయక్ బుధ వారం బాధ్యతలు చేపట్టారు. కరీంనగర్ జిల్లా ఎఫ్ టిసిలో డీడీగా విధులు నిర్వహించిన చత్రు నాయక్ బదిలీపై మంచిర్యాల జిల్లా డిఏఓగా వచ్చారు. బాధ్యతలు చేపట్టిన చత్రు నాయ క్కు ఏడిఏలు గోపాల్, సురేఖ, వ్యవసాయ శాఖ అధికారులు (టెక్నికల్)లు శ్రీనివాస్, ఫారిహన్, తరుణ్ బొకే అందజేసి స్వాగతం పలికారు.