15 June, 2026 | 11:25 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

వీధి కుక్కల దాడిలో 12 గొర్రెలు మృతి

08-10-2025 08:17 PM

తరిగొప్పుల (విజయక్రాంతి): మండలంలోని జాల్బాయ్ తండా గ్రామానికి చెందిన సభావాత్ భీమ గొర్రెల మందలపై వీధికుక్కలు బుధవారం ఉదయం దాడిచేసి 12 గొర్రెలను చంపేశాయి. వీధికుక్కలు గొర్రెలతో పాటు వాటిపిల్లలపై దాడిచేసి చంపేశాయి. దీంతో దాదాపు రూ.లక్షన్నర నష్టం వాటిల్లిందని గొర్రె కాపారులు సభావత బీమా ఆరోపించారు. ఎంతో కష్టపడి పెంచుకుంటున్న గొర్రెలు, కుక్కల దాడిలో మృతి చెందడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. వీధి కుక్కలను సంబంధిత అధికారులు పట్టించుకోవాలని కోరారు. పరిహారం అందేలా అధికారులు చొరవచూపాలని కోరారు.