15 April, 2026 | 12:55 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

శంషాబాద్‌లో కాల్పుల కలకలం

21-11-2025 12:00 AM
  1. ఆటో కిరాయి గొడవతో ఎయిర్ గన్‌తో ఫైరింగ్
  2. ప్రయాణికుడు సమీర్ దాస్ కడుపులోకి దూసుకెళ్లిన తూటా
  3. నర్కుడాలో ఘటన.. పోలీసులకు ఫిర్యాదు

మణికొండ, నవంబర్ 20 (విజయక్రాంతి) : ఆటో కిరాయి విషయంలో తలెత్తిన చిన్న వివాదం కాల్పులకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండ లం నర్కుడ గ్రామంలో గురువారం ఎయిర్ గన్ కాల్పుల ఘటన స్థానికంగా కలకలం రేపిం ది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సమీర్ దాస్, అతని మేనల్లుడు పింటూ నర్కుడాలో వెళ్లేందుకు ఒక ఆటోను కిరాయికి మాట్లాడుకున్నారు.

ఈ క్రమంలో కిరాయి విషయంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆటోలో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి ఆగ్రహంతో ఎయిర్ గన్‌తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సమీర్ దాస్ కడుపులోకి తూటా దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన సమీర్ను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి మేనల్లుడు పింటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.