18-06-2025 12:00:00 AM
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఆదేశం
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 17(విజ యక్రాంతి): ప్రభుత్వంచే గుర్తించబడిన విత్తనాలు, ఎరువులను రైతులకు నిర్దేశించిన ధరలకు మాత్రమే విక్రయించాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం వాంకిడి మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వ ర విత్తనాలు, ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి నిల్వలు, రసీదు పుస్తకం, రిజిస్టర్లు, ఎరువుల గోదామును పరిశీలించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసు కోవడం జరుగుతుందని, దుకాణం ఎదుట ధరల పట్టిక, దుకాణంలోని నిల్వల వివరా లు ప్రదర్శించాలని తెలిపారు.
రైతులకు విక్రయించినప్పుడు తప్పనిసరిగా రసీదు జారీ చేయాలని, రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన రసీదులను జాగ్రత్తగా తమ వద్ద భద్రపరుచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ డి. కవిత, వ్యవసాయ అధికారి మిలింద్ కుమార్, రైతులు పాల్గొన్నారు.