calender_icon.png 18 June, 2025 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు

18-06-2025 12:00:00 AM

నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి

నిర్మల్, జూన్ 17 (విజయక్రాంతి): నిర్మ ల్ నియోజకవర్గంలో అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం నిర్మ ల్ రూలర్ మండలంలోని తాంష సోన్ మం డలంలోని సిద్దిలకుంట మాదాపూర్ సొన్ వెల్మల్ బొప్పారం లక్ష్మణ చందా మండలంలోని వివిధ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారులకు పట్టాలను అందించారు,

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ నిధులతో చేపట్టబోయే సీసీ రోడ్లు మురికి కాలువల నిర్ణయానికి శం కుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు సత్యనారాయణ గౌ డ్,  పద్మ రమేష్ సరికెల గంగన్న, మండల అధ్యక్షులు మార గంగారెడ్డి, హరీష్ రెడ్డి, గంగ రెడ్డి, భోజారెడ్డి,రాజేశ్వర్, ముత్యం, సంత రమేష్, కళ్యాణ్,  హనుమంత్, సందీప్, ఉదయ్‌పాల్గొన్నారు