03-02-2026 01:03:40 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 2(విజయక్రాంతి): సిర్పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకీ ఎదురుదెబ్బ తగిలింది. బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ముఖ్య అనుచరుడు, నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ లెండుగురే శ్యామ్ రావు తన అనుచరులతో కలిసి సోమవారం ఎమ్మెల్సీ దండే విఠల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్యామ్ రావు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీలో బహుజన వర్గాలకు అన్యాయం జరుగుతోందని, అందుకే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడు తూ కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు సముచిత స్థానం ఉంటుందని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని పేర్కొన్నారు.