03-08-2025 01:10:41 AM
మహబూబాబాద్,(విజయక్రాంతి): సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో భాగంగా 2024 మొదటి త్రైమాసికంలో మూడు బ్లాకుల్లో 5 సంతృప్తికర సూచికలను సాధించినందున మహబూబాబాద్ జిల్లాకు నీతి ఆయోగ్ సంస్థ రాష్ట్ర స్థాయిలో సిల్వర్ మెడల్ ప్రకటించింది. ఈ మేరకు శనివారం రాజ్ భవన్ లో నిర్వహించిన సంపూర్ణ అభియాన్ సమ్మాన్ సమారోహ్ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో సిల్వర్ మెడల్ అందుకున్నారు.