24-01-2026 09:56:58 AM
ఎంపీడీవో ప్రవీణ్ కుమార్
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో ప్రజా వేదిక నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తెలంగాణ 14వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక ఈనెల 27న ఉదయం 10 గంటలకు రైతు వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కావున ఇట్టి కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.