calender_icon.png 28 May, 2025 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక దళితోద్ధారకుడు బాబు జగ్జీవన్ రామ్

05-04-2025 04:46:00 PM

లెదర్ పార్క్ అధ్యక్షులు కొలుగూరి విజయకుమార్..

మందమర్రి (విజయక్రాంతి): సామాజిక దళితొద్దారకుడు, దార్శినికుడు, సంఘ సంస్కర్త మాజీ భారత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని మలుపు లెదర్ పార్క్ అధ్యక్షుడు కొలుగూరి విజయ్ కుమార్ అన్నారు. భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకోని శనివారం పట్టణంలోని మలుపు లెదర్ పార్క్ ఆవరణలో వేడుకలను ఘనంగా జరిపారు. ముందుగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా  కొలుగూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ... విద్యార్థి దశనుండే సామాజిక అంశాలపై పోరాటాలను చేసి ఉప ప్రధానిగా ఎదిగిన బాబు జగ్జీవన్ రామ్ చరిత్ర దళితులకు స్ఫూర్తి అన్నారు.

సుమారు 30 సంవత్సరాలు కేంద్రమంత్రిగా ప్రజా ప్రతినిధిగా విశిష్ట సేవలు అందించిన బాబు జగ్జీవన్ రామ్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లెదర్ పార్కులో జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత ఉద్యమ నాయకులు సంగి సంతోష్, ఉప్పులేటి నరేష్, తుంగపిండి రాజేష్ కుమార్, నోముల దుర్గప్రసాద్, సోమారపు సామెల్, సుద్దాల జనార్ధన్, దరిపెళ్లి కనకయ్య, కొలుగూరి పృథ్వీరాజ్, మహిళా నాయకురాల్లు బత్తుల సరిత, బొడ్డు వినోద, దరిపెల్లి స్వరూపరాణి, దాసరి సమత, కాంపెల్లి లక్ష్మిలు పాల్గొన్నారు.