9 April, 2026 | 11:44 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

సామాజిక న్యాయమే ఎజెండా

15-08-2024 12:06 AM

అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలబెడతాం

స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశంలోని ప్రజలందరికి సామాజిక న్యాయమే ఎజెండాగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి మోదీ సర్కారు ఎన్నో భిన్నమైన పథకాలను చేపట్టిందని చెప్పారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి బుధవారం సందేశమిచ్చారు. రాజకీయ ప్రజాస్వామ్యం స్థిరమైన ప్రగతి ద్వారా సామాజిక న్యాయాన్ని సాధించే ప్రయత్నం చేస్తున్నట్టు వెల్లడించారు.

మన సామాజిక జీవనంలోని ప్రతి పార్శంలో సమ్మిలిత భావనను పెంపొందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రపంచంలో భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగటం గర్వంగా ఉందని తెలిపారు. త్వరలోనే మొదటి మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టడమే లక్ష్యమని స్పష్టంచేశారు. నిత్య శ్రమతో అన్నదాత దేశప్రజల ఆకలి తీరుస్తున్నాడని రైతుల సేవలను కొనియాడారు. మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు వెల్లడించారు.