17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

బాధితుల సమస్యలు పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ నితికా పంత్

20-12-2025 05:22 PM

వాంకిడి,(విజయక్రాంతి): పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల సమస్యలపై ప్రత్యేక చొరవ చూపాలని పోలీస్ అధికారులను  జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశించారు. శనివారం వాంకిడి పోలీస్ స్టేషన్ ను  ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసర ప్రాంతాలతో పాటు, రికార్డులు, సిబ్బంది విధులు తదితర విషయాలపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారులపై మర్యాదగా మెలగాలని ఫిర్యాదులను తక్షణమే విచారణ చేపట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ వెంట వాంకిడి సిఐ సత్యనారాయణ, ఎస్సై మహేందర్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.