24 June, 2026 | 12:27 AM

Breaking News

నరకానికి నకలు.. కెల్లేడు రహదారి   •   గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •  

బాధితుల సమస్యలు పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ నితికా పంత్

20-12-2025 05:22 PM

వాంకిడి,(విజయక్రాంతి): పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల సమస్యలపై ప్రత్యేక చొరవ చూపాలని పోలీస్ అధికారులను  జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశించారు. శనివారం వాంకిడి పోలీస్ స్టేషన్ ను  ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసర ప్రాంతాలతో పాటు, రికార్డులు, సిబ్బంది విధులు తదితర విషయాలపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారులపై మర్యాదగా మెలగాలని ఫిర్యాదులను తక్షణమే విచారణ చేపట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ వెంట వాంకిడి సిఐ సత్యనారాయణ, ఎస్సై మహేందర్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.