31-10-2025 01:00:50 AM
నాగల్ గిద్ద, అక్టోబర్ 30: నాగల్ గిద్ద మండలం నూతన ఎంపీడీవోగా స్పందన దుర్గ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్ 1 పరీక్షలకు సిద్ధమై గ్రూప్ 1 పరీక్షల ద్వారా ఎంపీడీవోగా హోదా సాధించిన ఆ మెకు ఇది తొలి పోస్టింగ్. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధికారికంగా వారు పదవి స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో స్పందన దుర్గ మాట్లాడుతూ మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవం తం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు వారికి మండల ఎంపీఓ మహేశ్వరరావు, ఏపీఓ మురళి, మండల అధికారులు, మండల పం చాయతీ కార్యదర్శులు ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన స్పందన దుర్గకి శాలువా బోకేతో ఘనంగా సన్మానించారు.