17 April, 2026 | 2:37 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మిత్రుని జ్ఞాపకార్థంగా రక్తదాన శిబిరం

01-11-2025 10:06 PM

చిట్యాల (విజయక్రాంతి): చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామంలో తన తోటి చిన్ననాటి మిత్రుడు రుద్రారపు చందు 23 అక్టోబర్ 2025న అకాల మరణం చెందగా తన తోటి చదువుకున్న పదవ తరగతి బ్యాచ్ 2016-17 మిత్రులు అందరూ కలిసి చదువుకున్న రుద్రారపు చందు జ్ఞాపకార్థంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి సుమారు 20 మందికిపైగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమం భాగంగా తన మిత్రులంతా మాట్లాడుతూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని, మున్ముందు ఇలాంటి కార్యక్రమంలు కొనసాగిస్తామని తెలిపారు.

నలగొండ పట్టణంలో గల అపర్ణ బ్లడ్ బ్యాంక్ అండ్ స్కానింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో దాదాపు 20 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో తుమ్ముకుంట్ల సాయికుమార్, రుద్రారం సాయికుమార్, వరుకుప్పల నవీన్, మెట్టు రాము, ఆవుల శివ, రూపని గణేష్, రూపని పవన్, మాలిగ కిరణ్, రేగులగడ్డ శివ, వినయ్, భాస్కర్, నరేష్, గ్రామ పెద్దలు, యువజన సంఘాలు పాల్గొన్నారు